Disruption of flights in Gannavaram

గన్నవరంలో విమాన రాకపోకలకు అంతరాయం..

అమరావతి : గన్నవరం ఎయిర్‌పోర్టును పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. పొగమంచుతో ఢిల్లీ నుంచి వచ్చి ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ల్యాండింగ్ ఇబ్బంది తలెత్తడంతో గాలిలోనే విమానం చక్కర్లు కొడుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలముకుంది. పొగమంచు కారణంగా రహదారులపై పొగమంచు కమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది.

దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదని వాతావరణం అనుకూలించిన వెంటనే క్లియరెన్స్ ఇస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి వచ్చిన విమానానికి ల్యాండింగ్ అయ్యేందుకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది.

గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగాల్సిన ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొడుతున్న వార్త తెలిసి ప్రయాణికుల బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా పార్క్ లైట్లు వేసుకుని వస్తే గానీ ముందర వచ్చే వాహనాలు కనబడే పరిస్థితి నెలకొంది. దగ్గరకు వచ్చే వరకు కూడా వాహనాలు ఏంటి అనేది తెలియక వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వాహనాలను జాగ్రత్తగా, అతి నెమ్మదిగా నడుపుతూ ముందుకు వెళ్తున్నారు వాహనదారులు. పొరపాటున ఎదురు వాహనాలను కనబడకపోతే పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Related Posts
KTR: అవయవ దానానికి ముందుకు వచ్చిన కేటీఆర్
KTR comes forward for organ donation

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును Read more

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు ఎందుకంటే?
కోడిపందేలు కేసు.. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిపై మరోసారి పోలీసుల నోటీసులు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారిన కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. Read more

వంశీ కి బెయిల్ వచ్చేనా!
వంశీ కి బెయిల్ వచ్చేనా!

ఆంధ్రప్రదేశ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అరెస్టు, రిమాండ్ వ్యవహారం ప్రస్తుత పరిణామాలతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై Read more

కొండా సురేఖకు భారీ షాక్.. కోర్టు నోటీసులు
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు షాకిచ్చింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను Read more