బంగ్లాదేశ్ పై చర్చిండి.. ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానాలు
న్యూఢిల్లీ: ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించాలని కోరుతూ ఈరోజు ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానా లు ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వాయిదా తీర్మానం ఇచ్చారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిపై చర్చించాలని, ఆ దేశం వల్ల భారత్పై పడే ప్రభావం గురించి చర్చించాలని ఆయన తన వాయిదా తీర్మానంలో కోరారు. ఇక లోక్సభలోనూ ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి ఈ తీర్మానం ప్రజెంట్ చేశారు.
బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో నేడు కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజుతోపాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.
కాగా, ప్రస్తుతం షేక్ హసీనా .. భారత్లోనే ఉన్నారు. అయితే లండన్లో ఆమెకు ఆశ్రయం దొరికితే వరకు ఆమె ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.