NICకి ధరణి పోర్టల్ బాధ్యతలు..?

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందా..? ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా..? అంటే అవుననే తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రైవేటు ఏజెన్సీ ఈ పోర్టల్ను నిర్వహించగా, దానికి సంబంధించిన గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NICకి పోర్టల్ బాధ్యతలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ధరణిలో ఉన్న అప్లికేషన్ ఫీజులను తగ్గించనున్నట్లు సమాచారం.