Supreme Court : ఇటీవల సుప్రీంకోర్టు గవర్నర్లు మరియు రాష్ట్రపతి వ్యవహారాలపై చేసిన కీలక వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు లేదా రాష్ట్రపతి ఆలస్యంచేయకుండా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన 6వ రాజ్యసభ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో పాల్గొన్న ఆయన, న్యాయవ్యవస్థ ఇటీవలి తీర్పును తప్పుపట్టారు.రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన ధన్కడ్, Supreme Court ప్రత్యేక అధికారాలు ఉన్నప్పటికీ, అవి ప్రజాస్వామ్య వ్యవస్థలపై న్యూక్లియర్ మిస్సైల్లా ఉపయోగించకూడదని హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా కోర్టుకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నా, వాటిని అపవాడుగా వాడటం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్రపతి ఒక అత్యున్నత స్థాయి వ్యక్తి అని, ఆయనను ఆదేశించాల్సిన అవసరం ఏమిటని ధన్కడ్ ప్రశ్నించారు.

Supreme Court : ఉపరాష్ట్రపతికి అసంతృప్తి: కోర్టు వ్యాఖ్యలపై ఘాటైన స్పందన
తీర్పుల్లో కోర్టు వ్యాఖ్యల ద్వారా జడ్జిలే శాసన వ్యవహారాలను చూసేలా, ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలను అమలు చేసేలా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. ఇదంతా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకించి న్యాయవ్యవస్థలోని ధర్మాసనాలు రాజ్యాంగంపై తీర్పులు ఇచ్చే సమయంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాల్సిన అవసరం ఉందని Article 145(3) ప్రకారం గుర్తుచేశారు.ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నదే అసలైన ధ్యేయమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇటీవలి తీర్పులో సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను అనవసరంగా ఆలస్యం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ఆలస్యాలను నివారించేందుకు బిల్లులను సమయానికి ఆమోదించాల్సిందిగా సూచనలు చేసింది. ఇదే అంశం వివాదానికి దారితీసింది.Supreme Court వ్యాఖ్యలు సున్నితమైన అంశాలపై సమగ్రంగా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంలా అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, మూడు ప్రధాన శక్తుల మధ్య సమతౌల్యానికి ప్రమాదం కలిగించే విధంగా ఉండకూడదని ఆయన గట్టిగా పేర్కొన్నారు.
Read More : Hyderabad : తల్లి ఇద్దరు పిల్లల హత్య, ఆత్మహత్య