తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈకార్యక్రమం బుధవారం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. నిహార్, శ్రీసాయి నర్మద పెళ్లి వేడుకలకు రాజకీయ, న్యాయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరయ్యారు.
ప్రత్యేక ఆకర్షణ గా తెలంగాణ సీఎం
ఈ ప్రత్యేక వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు, ఉమా అభిమానులు, కుటుంబ సన్నిహితులు పాల్గొన్నారు. సంప్రదాయరీతిలో నిర్వహించిన ఈ వేడుకకు కళా వైభవం తోడైంది.
Read Also : Pakistan: ఆదేశాల కోసం చెత్త పనులు చేస్తున్నామన్న పాక్- స్పందించిన అమెరికా
సోషల్ మీడియా లో పెళ్లి ఫొటోస్ వైరల్
పెళ్లి కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిహార్, నర్మద జంటకు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలంకరణ, హాస్టిపాల స్వాగతం, సంగీత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుక దేవినేని ఉమా రాజకీయ జీవితంలో ఓ చిరస్మరణీయ ఘట్టంగా మారింది.