డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రజల నుండి పిర్యాదులు స్వీకరిస్తూ..వాటిపై చర్యలు మొదలుపెట్టిన పవన్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ప్రజలను తన శాఖలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేశారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, టూరిజం, సినిమాటోగ్రఫీ కి సంబంధించిన శాఖలపై ప్రజలు తమ సూచనలు తెలపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక రేపటి నుండి పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. 11 రోజుల పాటు పవన్ ఈ దీక్ష చేయనున్నారు.