Deputy CM Pawan Kalyan speech in assembly

Pawan Kalyan: మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందకృష్ణ : పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందకృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు కారణమని అన్నారు. మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందకృష్ణ. ఆ కులానికి వన్నె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని వివరించారు.

Advertisements
మాదిగ అని చెప్పగలిగే గుండె

గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు

ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి. గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు జరిగాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాతో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేశారు. కమిషన్‌ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నా అని పవన్‌ కల్యాణ్ అన్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని, గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. తాను కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి చూపించానని, ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను కలిశానని తెలిపారు.

ఆయా కులాల జనాభాలో తేడాలు

ఇక, ఏపీలో మాల కులస్తులు ఎక్కువగా ఉంటారని, తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉంటారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా కులాల జనాభాలో తేడాలు ఉన్నాయని తెలిపారు. ఇలా ఒక్కో చోట ఒక్కో కులం ఆధిక్యంలో ఉందని, ఈ నేపథ్యంలో వర్గీకరణ చేయడం అనేది ఎంతో సమతుల్యంతో చేయాల్సిన పని అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లును జనసేన తరఫున మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Related Posts
ట్రంప్ ఆహ్వానంతో అమెరికా వెళ్లనున్న మోదీ
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం వైట్‌హౌస్‌ను సందర్శించబోతున్నారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. జనవరి 27న Read more

Space: నేడు అంతరిక్షంలోకి మహిళా బృందం
నేడు అంతరిక్షంలోకి మహిళా బృందం

మ్యూజిక్, మూవీస్, జర్నలిజం, రీసర్చ్…ఇలా విభిన్న రంగాలకు చెందిన మహిళా బృందం ఏప్రిల్ 14న అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ 'బ్లూ ఆరిజిన్' Read more

టాటా ఏస్ EV ఫ్లీట్‌తో లాస్ట్-మైల్ డెలివరీని విప్లవాత్మకంగా మారుస్తున్న గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ
Green drive mobility revolutionizing last mile delivery with Tata Ace EV fleet

హైదరాబాద్ : సుస్థిరమైన అర్బన్ లాజిస్టిక్స్ వైపు గణనీయమైన పురోగతితో, గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవంలో కీలకపాత్ర పోషిస్తూ.. అగ్ర ఆటగాళ్లలో ఒకటిగా Read more

నూతన షోరూమ్‌తో కార్యకలాపాలను విస్తరించిన ప్యూర్ ఈవీ
Pure EV expands operations with new showroom

హైదరాబాద్‌: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ , ఈరోజు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద షోరూమ్‌లలో ఒకదానిని ప్రారంభించినట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×