Deputy CM gave declaration to Tirumala along with daughters

కూతుళ్ల‌తో క‌లిసి తిరుమ‌లకు పవన్‌..డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం

Deputy CM gave declaration to Tirumala along with daughters.

తిరుమల: తిరుమ‌ల శ్రీవారి ప్ర‌స్తాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ 11 రోజుల పాటు ప్రాశ్చిత్త దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఆయ‌న శ్రీవారిని ద‌ర్శించుకుని దీక్ష‌ను విర‌మించ‌నున్నారు. ఇక మంగ‌ళ‌వారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. నేటి ఉద‌యం స్వామివారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య‌, చిన్న కూత‌రు పొలెనా అంజ‌ని కొణిదెల‌తో క‌లిసి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది.

ప‌వ‌న్ చిన్న కుమార్తె క్రిస్టియ‌న్ కావ‌డంతో టీటీడీ అధికారులు డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు తీసుకున్నారు. ఆమె మైన‌ర్ కావ‌డంతో తండ్రిగా ప‌వ‌న్ కూడా ఆ ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. కాగా, రాష్ట్రంలో డిక్ల‌రేష‌న్ విష‌య‌మై వివాదం నెలకొన్న వేళ జ‌న‌సేనాని చేసిన ప‌నితో ఒక విధంగా ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లైంది. ఇక స్వామివారి ద‌ర్శ‌నం అనంత‌రం ప‌వ‌న్ కల్యాణ్ నేరు తరిగొండ అన్న‌ప్ర‌సాద స‌ముదాయానికి చేరుకోనున్నారు. అక్క‌డ భక్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను డిప్యూటీ సీఎం ప‌రిశీలించ‌నున్నారు. అలాగే భ‌క్తుల‌తో క‌లిసి సహ‌పంక్తి భోజ‌నం కూడా చేస్తార‌ని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ప‌వ‌న్‌-అన్నా లెజ్నెవా కూతురు క‌నిపించ‌డంతో ఆయ‌న అభిమానులు ఆ ఫొటోల‌ను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ప‌వ‌న్ చిన్న కూతురు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Related Posts
భారత్‌లో పర్యటిస్తున్న స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్
Spanish Prime Minister Pedro Sanchez is visiting India

న్యూఢిల్లీ: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్‌లోని గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరానికి సోమవారం తెల్లవారుజామున చేరుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి అక్కడ రోడ్‌షోలో Read more

ఆరోగ్య బీమా పథకం ‘సర్వః ’ను విడుదల చేసిన మణిపాల్‌సిగ్నా
A holistic health insurance scheme with special focus on the under insured segment in India

హైదరాబాద్‌: మణిపాల్‌సిగ్నా సర్వః మూడు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్లాన్‌లను : సర్వః ప్రథం , సర్వః ఉత్తమ్ మరియు సర్వః పరమం విడుదల చేసింది. ప్రజల ఆర్థిక Read more

జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. నటి, బీజేపీ నేత మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి Read more

ప్రమాదం నుండి తపించుకున్న పొంగులేటి
ప్రమాదం నుండి తపించుకున్న పొంగులేటి1

రెవెన్యూ మంత్రి వరంగల్ నుంచి ఖమ్మం తిరిగి వస్తుండగా తిరుమలయపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సాయంత్రం ఖమ్మం Read more