జగన్ కు భారీ షాక్..తాడేపల్లిలో పార్టీ కార్యాలయం కూల్చివేత

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ కు భారీ షాక్ ఇచ్చింది కూటమి సర్కార్. తాడేపల్లిలో నిర్మాణంలో అక్రమంగా కడుతున్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసింది. శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభించారు. పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ నిన్న హైకోర్టును కోర్టును ఆశ్రయించింది వైసీపీ.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయ నిర్మాణం మొదలైంది. కానీ ఇక్కడ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని గతంలో సీఆర్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో.. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారడంతో అధికారులు దాన్ని కూల్చివేశారు.