ఢిల్లీలో వరదలు.. నీట మునిగిన కాలనీలు

గురువారం తెల్లవారుజాము నుంచి దంచికొడుతున్న వానలతో ఢిల్లీ నగరం అతలాకుతలం అయింది. వరద నీరు ముంచెత్తడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మెహ్ర్లీ-బదార్పూర్, పరేడ్ రోడ్, కంటోన్మెంట్, ధౌలాఖాన్, గురుద్వారా రాకబ్ జంగ్, జీసస్ మేరీ మార్గ్, ఆర్కే పురం సెక్టార్ ప్రాంతాల్లో వరదలతో జనజీవనం స్తంభించింది. కొన్నాళ్లుగా ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.