ఢిల్లీ ప్రజలకు కొత్త కష్టం

నిన్నటి నీటి కోసం తీవ్ర కష్టాలు పడిన ఢిల్లీ ప్రజలకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. ఢిల్లీలో నిన్న ఒక్క రోజు 228.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 88 ఏళ్ల రికార్డులను ఈ వర్షం తిరగరాసింది. 24 గంటల్లో ఏకంగా జూన్‌లో ఈస్థాయిలో వర్షం పడడం ఇదే తొలిసారి. జులై 1వ తేదీ వరకు రాజధానిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.

ఈ భారీ వర్షం కారణంగా ఢిల్లీలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. రోడ్లు, వీధులు తేడాలేకుండా వర్షపు నీటితో కలిసిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న పైకప్పు కూలిన టెర్మినల్-1ను నేడు కూడా మూసివేశారు.