మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ఏడుగురు తెలుగువారు దుర్మరణం

హైదరాబాద్ వాసుల మృతి

తెలుగు యాత్రికులు ప్రయాగరాజ్ లో కుంభమేళా కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రయాణిస్తున్న మినీ బస్సు ను లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్ లో ని జబల్ పుర్ లో జరిగిన ఘటన లో 7 మృతి చెందారు.మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతులను హైదరాబాద్ లో ని నాచారం వాసులు గా గుర్తించారు. జబల్ పుర్ లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8 .30 గంటల ప్రాంతం లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్ తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్ రూట్ లో రావడం తో ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మినీ బస్సు లో చిక్కుకున్న మరికొందరిని స్థానికులు బయటకు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయం లో మినీ బస్సు లో 14 మంది ఉన్నారు. క్షత్రగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు.వీరిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదానికి గురైన వాహనం నెంబర్ AP29W 1525 గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయ్యి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

రేవంత్ సంతాపం
ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ,గాయపడిన వ్యక్తి కుటుంబానికి మెరుగైన వీయడం అందించాలని అధికారులను ఆదేశించారు.

1522626 accident

రోడ్డు భద్రతపై పెరుగుతున్న ఆందోళన

ప్రతీ ఏడాది వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
డ్రైవింగ్ నియమాలను ఉల్లంఘించకపోతే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.
రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం, అతివేగం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ చర్యలు & నివారణ మార్గాలు

తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది.
ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని సమాచారం.
రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదం రోడ్డు భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుని అలాంటి ప్రమాదాలు మరల జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంభమేళా సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్న 14 మంది తెలుగు యాత్రికులు ప్రయాణిస్తున్న మినీ బస్సును, రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు అందరూ హైదరాబాద్, నాచారం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.

Related Posts
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రంప్ -జెలెన్స్కీ సమావేశం
నా స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాదు: జెలెన్స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో ట్రంప్ జెలెన్స్కీపై తీవ్రంగా Read more

డాక్టర్లను, న్యాయవాదులను అధిగమించే AI: ఎలాన్ మస్క్ ఏమంటున్నారు?
Elon Musk

ఎలాన్ మస్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యొక్క వేగవంతమైన అభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆయన చెప్పినట్లు, AI సాధనాలు, ముఖ్యంగా చాట్GPT, ప్రస్తుత కాలంలో పెద్ద Read more

Sunrisers Hyderabad: ఉప్పల్‌లో ఈ రోజు మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు!
Sunrisers Hyderabad: ఉప్పల్‌లో ఈ రోజు మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు!

ఐపీఎల్ 2024 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇవాళ ఆదివారం కావడంతో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతుండగా, రెండో మ్యాచ్‌లో Read more

సింగపూర్ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ చర్చలు
సింగపూర్ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ చర్చలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్య అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ మరియు సింగపూర్ Read more