సైబర్ ఉచ్చులో పడి నగదు కోల్పోయిన మహిళ .మహిళా ఖాతానుండి 17 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దనలక్ష్మీనగర్ లోచోటు చేసుకున్న వైనం.ఆన్లైన్ లో ఉద్యోగాల పేరిట వాట్సప్,టెలిగ్రాం లో లింకులు.స్టార్ హోటల్స్ కు రేటింగ్ పేరుతో నమ్మించి లాభాలు తీసుకున్నట్లు చూపించే సమాచారం గ్రూపులో పోస్ట్.
నమ్మిన బాధితురాలు సుజాత 17 లక్షలు పలు అకౌట్లకు ట్రాన్స్ఫర్.అకౌంట్లు బంద్ కావడంతో పోలీసులు ఆశ్రయించిన బాధితురాలు.వాట్సాప్, టెలిగ్రామ్ సందేశాలను నమ్మవద్దు.తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింక్స్ క్లిక్ చేయడం, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు ఇవ్వడం మానుకోండి.
ఆన్లైన్ లో ఉద్యోగాలు పేరిట డబ్బు పంపాలని కోరితే అవి మోసం అని గుర్తుంచుకోండి.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ ను సంప్రదించండి .www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి.నగర ప్రజల అప్రమత్తకు తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు సూచనలు .