జమ్మూ కశ్మీర్లో పాక్తో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ భద్రతా బలగాల మోహరింపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బుద్గామ్ జిల్లాలో దుర్ఘటన జరిగింది. మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది వరకు గాయపడ్డారు. వాహనం 181వ బెటాలియన్కు చెందినదిగా గుర్తించబడింది. తంగనర్ కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వాహనం లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిపోవడంతో తీవ్ర దెబ్బలు తగిలాయి.
Read Also : Smitha Sabarwal : ‘కర్మణ్యే వాధికారస్తే’ అంటూ స్మిత ట్వీట్
గాయపడ్డ ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు
గాయపడిన వారిలో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కాగా, మిగిలిన ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 10 మందిలో తొమ్మిది మంది స్పెషల్ క్విక్ యాక్షన్ టీమ్కు చెందినవారిగా సమాచారం. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాహనం బోల్తా పడిన తర్వాత అక్కడి ప్రజలు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని బయటకు తీసేందుకు సహాయపడ్డారు.
ఇద్దరి పరిస్థితి విషమం
గాయపడిన వారిని తొలుత ఖాన్సాహిబ్ సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అనంతరం శ్రీనగర్లోని 92 బేస్ ఆర్మీ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటన భద్రతా సిబ్బందికి ఎదురయ్యే ప్రతిఘటనలు ఎంత తీవ్రంగా ఉంటాయో మళ్ళీ ఒకసారి వెల్లడించింది. అధికారులు ప్రమాదానికి గల కారణాలను వివరంగా పరిశీలిస్తున్నారు.