ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు

హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. నిన్న మంగళవారం జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. కౌశిక్‌రెడ్డిపై జిల్లా పరిషత్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో BNS యాక్ట్ ప్రకారం 122, 126 (2) సెక్షన్ల కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో విద్యారంగానికి సంబంధించి నెలకున్న సమస్యలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అయితే ఈ రివ్యూ మీటింగ్‌కు హాజరైన MEOలను..డీఈఓ ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీంతో ఆ డీఈఓను వెంటనే సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ను పట్టుబట్టారు..కౌశిక్‌రెడ్డి. ఈ అంశంపై సమాధానం ఇవ్వాలంటూ సమావేశ మందిరంలోనే ఆందోళనకు దిగారు. సమావేశంలో ధర్నాకు దిగిన కౌశిక్‌రెడ్డి తీరును తప్పుబట్టారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ రవీందర్‌. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ క్రమంలో జెడ్పీ మీటింగ్‌ గందరగోళంగా మారడంతో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు..కలెక్టర్‌ పమేలా సత్పతి.