అనంతపురం జిల్లాలోతహశీల్ధార్ కు, డాక్టర్ కు పాజిటివ్
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 17
Anantapur: అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 17 కి పెరిగాయి. ఇద్దరు మృతి చెందారు.
హిందూపురంలో నివాసం ఉంటున్న ఒక తహశీల్ధార్ కు, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ఒక డాక్టర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
హిందూపురంలో లోకల్ ట్రాన్స్మిషన్ వల్ల తహశీల్ధార్ కు కరోనా సోకగా, అనంతపురం సర్వజన ఆస్పత్రి లో కళ్యాణదుర్గం పాజిటివ్ కేసుకు సంబంధించిన కాంటాక్ట్ వల్ల డాక్టర్ కు పాజిటివ్ గానిర్ధారణ అయింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/