రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర

రాజస్థాన్లోని అజ్మీర్ లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఫూలేరా-అహ్మదాబాద్ రూట్లో రైల్వే ట్రాక్ ఫై దుండగులు 70kgs సిమెంట్ దిమ్మెను పెట్టారు. దీంతో రైలు దిమ్మెను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోగా, ట్రైన్ ఇంజిన్ తో పాటు కొంతభాగం దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2 రోజుల క్రితం యూపీలోని కాన్పూర్లోనూ రైల్వే ట్రాక్ ఫై గ్యాస్ సిలిండర్ పెట్టిన సంగతి తెలిసిందే.