Congress : అసెంబ్లీని కౌరవ సభలాగా కాంగ్రెస్ పార్టీ మార్చింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానించలేదు. ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. సెక్రటేరియట్ కు అంబేద్కర్ విగ్రహం పేరు బీఆర్ఎస్ పెట్టింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంకు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దండ వేయలేదు.

ప్రజా సమస్యలపై చర్చించండి
స్పీకర్ ను అవమానం చేశారని సభా సమయాన్ని వృధా చేశారు. స్పీకర్ పై ఒత్తిళ్ళు ఉన్నాయి. స్పీకర్ ను వ్యక్తిగతంగా జగదీష్ రెడ్డి సభలో అన్నట్లు వీడియో బయటపెట్టండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని సస్పెండ్ చేసి సభ నడుపుకుంటారా.. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజా సమస్యలపై చర్చించండి. బిల్లులపై చర్చ జరగకుండా ఉండాలని ప్రభుత్వం చూస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకుండా అసెంబ్లీని నడపాలని ప్రభుత్వం భావిస్తోంది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఆ ప్రసంగంపై దుమారం
కాగా, తెలంగాణ అసెంబ్లీ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్కుమార్ను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది.