తెలంగాణ, ఏపీకి ఏఐసీసీ కార్యదర్శుల నియామకం

దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏఐసీసీ కార్యదర్శులను నియమిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు విష్ణునాథ్, విశ్వనాథనను, ఏపీకి గణేశ్ కుమార్ యాదవ్ను నియమించారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ను ఛత్తీస్ గఢ్ ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏఐసీసీ తరఫున కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకాలు చేపట్టినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పీసీ విష్ణునాథ్‌ ప్రస్తుతం తెలంగాణ ఇన్‌చార్జ్‌ కార్యదర్శిగా పనిచేస్తుండగా ఆయనకు తాజాగా మరోసారి అవే బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సంపత్‌కుమార్‌కు అధిష్ఠానం ఛత్తీ్‌సగఢ్‌ ఇన్‌చార్జి కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. ఆయన గతంలో మహారాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు.