Computers for primary schools.. Government decision!

Primary Schools : ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు: ప్రభుత్వం నిర్ణయం!

Primary Schools : తెలంగాణ వ్యాప్తంగా 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని వచ్చే జూన్‌ 1 నాటికి పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 ప్రాథమిక పాఠశాలల్లో ఏక్‌ స్టెప్‌ సంస్థ సహకారంతో కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌ను వినియోగిస్తూ ఆంగ్లం, గణితం పాఠాలను విద్యార్థులకు బోధిస్తున్నారు. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. దీన్ని వచ్చే విద్యా సంవత్సరం (2025-26) రాష్ట్రంలోని మరిన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు కంప్యూటర్లు అవసరమైనందున వాటిని అందజేయనున్నారు. అంతేకాకుండా 1 నుంచి 5వ తరగతి వరకు గణితం సబ్జెక్టులో ఏఐ పాఠ్యాంశాన్ని కూడా చేరుస్తున్నారు.

Advertisements
ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు ప్రభుత్వం

ప్రతి ల్యాబ్‌కు 100 కంప్యూటర్లను సరఫరా

రాష్ట్రంలో 18,254 ప్రాథమిక పాఠశాలలుండగా.. వాటిలో 1,900 చోట్ల ఒక్క విద్యార్థి కూడా లేరు. 50 మంది దాటిన పాఠశాలలు సుమారు 3,500 వరకు ఉన్నాయి. డైట్‌ కళాశాలలను బలోపేతానికై ప్రభుత్వం ప్రతి దాంట్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనుంది. ప్రతి ల్యాబ్‌కు 100 కంప్యూటర్లను సరఫరా చేయనున్నారు. డిజిటల్‌ తరగతి గదుల కోసం ప్రతి కళాశాలకు ఆరు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లను అందజేస్తారు. వాటిని గ్రీన్‌బోర్డులుగాను, టీవీలుగాను వాడుకోవచ్చు. ప్రతి జిల్లాలో వేసవి సెలవుల్లో సమ్మర్‌ క్యాంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎటువంటి కార్యక్రమాలను అందించాలో నిర్ణయించేందుకు ఆయా డీఈవోలు కలెక్టర్లతో సంప్రదించి ఏప్రిల్‌ 4వ తేదీ నాటికి నివేదిక అందజేయాలి. ఆ తర్వాత ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో మేదోమథనం జరిపి కార్యక్రమాలను ఖరారు చేస్తామని విద్యాశాఖ పేర్కొంది.

Related Posts
19 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశం
19 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశం

తెలంగాణ బడ్జెట్ 2025: కీలక తేదీలు, సమావేశాల రొటీన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 19వ తేదీన ప్రవేశపెట్టనుంది. ఈ Read more

ఎనిమీ ప్రాపర్టీస్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay Key Comments on Enemy Properties

మార్చిలోపు ఆస్తుల లెక్క తేల్చాలి..అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని టూరిజం Read more

సీపీఎం ఏపీ కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Election of Srinivasa Rao as CPM AP Secretary

అమరావతి: భారత కమ్యూనిస్టు మార్కిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభలలో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి. Read more

Sitharamula Kalyanam : రాములోరి కళ్యాణానికి వేళాయె..
Sriramanavami april

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ పవిత్రమైన వేడుకను తిలకించేందుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×