జూలై 28న కల్వకుర్తి లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 28 న కల్వకుర్తి లో పర్యటించబోతున్నారు. గురువారం కల్వకుర్తి తహసీల్దార్​ ఆఫీస్​లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తో కలిసి సీఎం పర్యటన వివరాలు వెల్లడించారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి ఎస్​ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీఎం సీఎం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.

అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని , అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహ ఏర్పాటు పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి, పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.