నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy reached Hyderabad
CM Revanth Reddy will go to Delhi today

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో రేవంత్‌ భేటీ కానున్నారు. కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి రేవంత్ సోనియాను ఆహ్వానించనున్నారు. ఇక వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు.