నేడు IIHT ప్రారంభించనున్న సీఎం రేవంత్

కొత్త పద్ధతుల్లో చేనేత శిక్షణ ఇచ్చేందుకు నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(IIHT)ను నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నాంపల్లిలోని లలితా కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT)ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో “నేతన్నకు చేయూత” పథకం కింద 36,133 మంది లబ్దిదారులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.290 కోట్లు విడుదల చేస్తారు.

IIHTలో చేనేత రంగం లోని విద్యార్థులకు కొత్త టెక్నాలజీ పద్ధతుల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఐతే.. దేశంలో ఇదే తొలి IIHT కాదు. ఆల్రెడీ ఇలాంటివి 6 ఉన్నాయి. అందువల్ల వాటిలో ట్రైనింగ్ పొందిన వారు.. దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇందులో ట్రైనింగ్ పొందేవారు.. ఈ పోటీని తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. ఈ సంస్థ ఏర్పాటుతో ఏటా 60మంది విద్యార్థులకు చేనేత, టెక్స్టైల్స్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తామని మంత్రి తుమ్మల తెలిపారు

చేనేతకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి, పుట్టపాక, కొయ్యలగూడెం, నారాయణపేట, గద్వాల, సిద్దిపేట, వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఐఐహెచ్‌టీకి తాజాగా దరఖాస్తులు స్వీకరించింది. కనుముకుల హ్యాండ్లూమ్‌ పార్కులోని భవనాలను ఐఐహెచ్‌టీ కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. అక్కడ సరైన సదుపాయాలు లేనందున అధికారులు ఈ సంవత్సరం తాత్కాలిక హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 11 ఐఐహెచ్‌టీలు ఉండగా తెలంగాణకు మంజూరైన సంస్థతో కలిపి 12కు పెరిగాయి.

ఐఐహెచ్‌టీలో 60 సీట్లు ఉన్నాయి. ఇందులో మూడేండ్ల హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ డిప్లొమా కోర్సులు ఉండగా, అర్హులైన చేనేత కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి నెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500, కేంద్ర ప్రభుత్వం రూ.5000 చొప్పున ఉపకార వేతనం ఇస్తాయి. సెప్టెంబర్‌ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

.