CM Revanth Reddy praises government doctors

CM Revanth Reddy : ప్రభుత్వ వైద్యులను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న నానుడిని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తిరగరాశారని రాసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేశారని అన్నారు. ఇటీవల షిర్డీకి వెళ్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన 22 ఏళ్ల యువకుడిని చేర్చుకునేందుకు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించడంతో అతడి కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తరలించారు.

Advertisements
 ప్రభుత్వ వైద్యులను ప్రశంసించిన సీఎం

ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం

అక్కడ వైద్యులు యువకుడిని అడ్మిట్ చేసుకుని శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకున్నాడు. ఈ విషయాన్ని అతని ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఉస్మానియా ఆసుపత్రికి, అక్కడి వైద్యులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషయం న్యూస్ పేపర్లోనూ రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందం ఆదర్శంగా నిలిచారని అభినందించారు.

ప్రత్యేక అభినందనలు

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలచుకుంటే.. ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలరని రుజువు చేసారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉస్మానియా వైద్యులు.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్క వైద్యుడు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read Also: గచ్చిబౌలి భూముల వ్యవహారం..ప్రధానికి కేటీఆర్ విజ్ఞప్తి

Related Posts
టన్నెల్ లో కొనసాగుతున్న సాయం దుర్వాసనతో కార్మికుల ఆచూకీ పై ఆందోళన
టన్నెల్ లో కొనసాగుతున్న సాయం దుర్వాసన తో కార్మికుల ఆచూకీ పై ఆందోళన

SLBC ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికుల కోసం 15వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.టన్నెల్ చివరి భాగంలో రెండు కీలక ప్రాంతాలను గుర్తించడంతో సహాయక Read more

Kangana : కంగన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు.. అధికారుల రియాక్షన్
kangana current bill

బీజేపీ ఎంపీ మరియు సినీ నటి కంగనా రనౌత్ నివాసమైన మనాలి ఇంటికి వచ్చిన భారీ కరెంట్ బిల్లుపై హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ స్పందించింది. ఇటీవల Read more

Delimitation:ఒకే వేదికపై రేవంత్ రెడ్డి,కేటీఆర్
Delimitation:ఒకే వేదికపై రేవంత్ రెడ్డి,కేటీఆర్

2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది Read more

తెలంగాణ లో వరి పంట కొనుగోలు కేంద్రాలు సిద్ధం
Paddy procurement centers a

వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి సాగు ముందుగా పూర్తైన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×