CM Revanth Reddy : హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న నానుడిని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తిరగరాశారని రాసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేశారని అన్నారు. ఇటీవల షిర్డీకి వెళ్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన 22 ఏళ్ల యువకుడిని చేర్చుకునేందుకు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించడంతో అతడి కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తరలించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం
అక్కడ వైద్యులు యువకుడిని అడ్మిట్ చేసుకుని శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకున్నాడు. ఈ విషయాన్ని అతని ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఉస్మానియా ఆసుపత్రికి, అక్కడి వైద్యులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషయం న్యూస్ పేపర్లోనూ రావడంతో సీఎం రేవంత్రెడ్డి సైతం స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందం ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
ప్రత్యేక అభినందనలు
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలచుకుంటే.. ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలరని రుజువు చేసారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉస్మానియా వైద్యులు.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్క వైద్యుడు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: గచ్చిబౌలి భూముల వ్యవహారం..ప్రధానికి కేటీఆర్ విజ్ఞప్తి