CM Revanth Reddy meet with Rahul Gandhi..!

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

టెన్ జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను కలిసిన రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం సోనియాగాంధీ అధికారిక నివాసం 10 జెన్‌పథ్‌లో రాహుల్‌ గాంధీని రేవంత్‌ రెడ్డి కలిశారు. చాలాకాలం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రికి కాంగ్రెస్‌ అగ్రనేత అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి రాహుల్‌ కు రేవంత్‌ వివరించినట్టు సమాచారం.

రాహుల్ గాంధీ సీఎం రేవంత్

సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

త్వరలో సూర్యాపేట, మెదక్‌ లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ఏదో ఒక సభకు హాజరుకావాలని రాహుల్‌ గాంధీని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న రేవంత్‌ రెడ్డి శనివారం ఉదయం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలతో కలిసి 10 జెన్‌పథ్‌ కు వెళ్లారు. రాహుల్‌ తో సమావేశం సందర్బంగా కేబినెట్‌ విస్తరణ, పీసీసీ కార్యవర్గం నియామకం, నామినేటెడ్‌ పదవుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు అంశాల గురించి చర్చించనట్టుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై చర్చ

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అమలు పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ లో గద్వాల్ లేదా మెదక్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.

Related Posts
10th Exams : పరీక్షలే జీవితం కాదు.. ఆల్ ది బెస్ట్ – హోంమంత్రి అనిత
SSC Public Exams 2025: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుండి.. విద్యార్థులకు ఇవే ముఖ్య సూచనలు

ఏపీ హోంమంత్రి అనిత పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షలు జీవితంలో కీలకమైనవే కానీ, అవే జీవితం కాదని ఆమె అన్నారు. విద్యార్థులు టెన్షన్ Read more

రేవంత్ తో భేటీకి చిరంజీవి దూరం
revanth

రేవంత్ తో టాలీవుడ్ భేటీ ఆసక్తిని పెంచుతోంది. సంధ్యా థియేటర్ ఘటనతో పాటుగా సినీ పరిశ్రమ సమస్యల పైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు Read more

గేమ్ ఛేంజర్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల
arugumeedha

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ..సంక్రాంతి కానుకగా జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున Read more

Tragedy: ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపిన తల్లి, ఆపై ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో విషాదం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లే తన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసి, ఆపై Read more