‘తెలంగాణ ప్రజాపాలన; దినోత్సవానికి కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ కార్యక్రమానికి హాజరుకావాలంటూ నలుగురు కేంద్రమంత్రులకు CM రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. వీరిలో అమిత్ షా, గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు.

1948, సెప్టెంబ‌రు 17న తెలంగాణ‌లో ప్రజాస్వామిక పాల‌న శ‌కం ఆరంభ‌మైన సంద‌ర్భాన్ని పుర‌స్కరించుకొని తెలంగాణ ప్రజా పాల‌న దినోత్సవం నిర్వహించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింద‌ని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైద‌రాబాద్ నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో జ‌రిగే కార్యక్రమానికి హాజ‌రుకావాల‌ని కేంద్ర మంత్రుల‌ను ముఖ్యమంత్రి కోరారు.