నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్నం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి గానీ, సోమవారం గానీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తో భేటీ కానున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

దీనిని పురస్కరించుకుని వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్.. ఇతర కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైనా సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు సమాచారం.