తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు

వేసవి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచనలు

  • సాగు కోసం నీటి సరఫరా, ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు

వచ్చే మూడు నెలలు రాష్ట్రంలో తీవ్ర వేసవి ప్రభావం ఉండనుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం, అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బందితో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా నీటి వనరుల నిర్వహణ, సాగు కోసం నీటి సరఫరా, ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చారు.

ఉగాది పండుగ కానుకగా సన్నబియ్యం పంపిణీ

సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నీటి నిల్వలపై సమీక్ష జరిపిన సీఎం, ప్రణాళిక ప్రకారం సాగుకు తగినంత నీటిని విడుదల చేయాలని సూచించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని, రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు నిరంతర నీటి సరఫరా కొనసాగించాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

వేసవి తాపం పెరిగే కొద్దీ తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశమున్నందున గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని, తగినన్ని నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. అవసరమైన చోట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీ నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని వినియోగించకుండా అడ్డుకోవడానికి టెలిమెట్రీ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. ఏపీ నుంచి నీటి దోపిడీ జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

Related Posts
నిమిషం నిబంధనతో పరీక్ష మిస్
Miss the test with minute rule

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు గ్రూప్‌-3 Read more

Free Houses : ఉచిత ఇళ్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగానికి కొత్త ఊపునివ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు. వచ్చే ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన Read more

3500 కోట్ల ఒప్పందాలపై సంతకాలు..సీఎం రేవంత్‌రెడ్డి
3500 కోట్ల ఒప్పందాలపై సంతకాలు..సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ ఇప్పుడు గ్లోబల్ డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. హైటెక్ సిటీలో ఇప్పటికే డేటా సెంటర్ నిర్వహిస్తున్న ST Telemedia Global Data Center (STT GDC) Read more

ఐఈడీ పేలుడు.. కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ మృతి
explosion at building kills two people in moscow

మాస్కో: ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో ఈరోజు అనుమానిత ఐఈడీ పేలుడు సంభ‌వించింది. న‌గ‌రంలోని రాజ‌న్‌స్కీ ప్రాస్పెట్ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. Read more