విశాఖ వాసులకు సీఎం గుడ్ న్యూస్

విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. విశాఖ రీజియన్‌కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రాబోతున్నాయి. ప్రయాణీకులకు మంచి సర్వీసులు అందించేందుకు గాను సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులను అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే..మరోపక్క రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కరిస్తూ వస్తుంది. ఇక ఆర్టీసీ విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్‌లలో బస్సులు నడపాలని చూస్తున్నారు.