ఈనెల 11న విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు జులై 11 న వైజాగ్ లో పర్యటించబోతున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏపీ మెడ్ టెక్ జోన్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత సందర్శించి, మెడ్ టెక్ జోన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ,సీపీ శంభబ్రత బాగ్చి , జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.

సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం వైజాగ్ కు చంద్రబాబు వస్తున్నారని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. విశాఖకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. 11 తేదీన సీఎం ఉమ్మిడి విశాఖ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఏర్పాట్లు అన్ని పూర్తి అవుతున్నాయని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.