ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu’s visit to Uttarandhra districts

అనకాపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో దార్లపూడివద్ద పోలవరం ఎడమ కాలువను సీఎం పరిశీలించనున్నారు. మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్‌ జోన్‌ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై.. ఐదేళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు.