CM Chandrababu visit to Srikakulam district today

CM Chandrababu : నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఆ సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ముగించుకొని సాయంత్రం 5.45 గంటలకు విశాఖలోని కోస్టుగార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆంధ్ర వైద్య కళాశాలకు చేరుకుని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్మించిన శతాబ్ది భవనాన్ని ప్రారంభిస్తారు. రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు పయనమవుతారు.

Advertisements
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం

మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు

ఇక, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ.20వేలకు ప్రభుత్వం పెంచింది. మత్స్యకారులకు రూ. 258 కోట్లు నిధులను ప్రభుత్వం అందించనుంది. సీఎం చంద్రబాబు పర్యటన కోసం 1500 మంది భద్రతా సిబ్బంది బందోబస్తు చేస్తున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి, అనంతరం చెక్కుల పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి వస్తుండటంతో బుడగట్లపాలెం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ పర్యటనతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మత్స్యకారులకు నూతన ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి.

Read Also: మత్స్యకారుల సేవలో.. నేడు అకౌంట్లలోకి రూ.20వేలు

Related Posts
విజయ్ చౌక్ ఇండియా కూటమి ఎంపీల నిరసన
MPs of INDIA Alliance prote

శీతాకాల సమావేశాల చివరి రోజున కూడా పార్లమెంటు వేదికపై ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇండియా కూటమి ఎంపీలు విజయ్ చౌక్ వద్ద నిరసనకు దిగారు. అంబేడ్కర్ పై అమిత్ Read more

బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు
బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ రెవెన్యూ Read more

మాతృభాషపై మమకారం ఉండాలి: జస్టిస్ ఎన్వీ రమణ
ramana

తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుంది అని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలో సుప్రీంకోర్టు Read more

Telangana : ఒసాకా ఎక్స్‌పోలో సీఎం రేవంత్ రెడ్డి
Telangana : ఒసాకా ఎక్స్‌పోలో సీఎం రేవంత్ రెడ్డి

Telangana :పెట్టుబడులకు హబ్‌గా మారుతోంది: ఒసాకా ఎక్స్‌పో వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ వ్యాపారవేత్తలకు ఆహ్వానం తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×