CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఆ సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ముగించుకొని సాయంత్రం 5.45 గంటలకు విశాఖలోని కోస్టుగార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆంధ్ర వైద్య కళాశాలకు చేరుకుని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్మించిన శతాబ్ది భవనాన్ని ప్రారంభిస్తారు. రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు పయనమవుతారు.

మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు
ఇక, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ.20వేలకు ప్రభుత్వం పెంచింది. మత్స్యకారులకు రూ. 258 కోట్లు నిధులను ప్రభుత్వం అందించనుంది. సీఎం చంద్రబాబు పర్యటన కోసం 1500 మంది భద్రతా సిబ్బంది బందోబస్తు చేస్తున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి, అనంతరం చెక్కుల పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి వస్తుండటంతో బుడగట్లపాలెం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ పర్యటనతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మత్స్యకారులకు నూతన ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి.
Read Also: మత్స్యకారుల సేవలో.. నేడు అకౌంట్లలోకి రూ.20వేలు