రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు రేపు (మంగళవారం ) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి చేరుకుంటారు. ఈ నెల 23న బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.

ఇక రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని భావిస్తోంది ఆర్ధికశాఖ. అందుకే ఇప్పుడున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్టును కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసింది. దాని ప్రకారం ఈ నెల 22వ తేదీ లేదా దాని తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుటోంది. ఈ సమావేశం పూర్తి కాగానే చంద్రబాబు ఢిల్లీ కి వెళ్లనున్నారు.