తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu : ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. తన మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రమే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌లు తిరుమలకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్‌లో బస చేశారు.

Advertisements
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

కుటుంబానికి తీర్థ ప్రసాదాలు

నేటి ఉదయం సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అర్చకులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్‌లతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు చంద్రబాబు కుటుంబానికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.

నారా దేవాన్ష్ పేరుతో అన్నదానం

శ్రీవారి దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో తన మనవడు, బర్త్ డే బాయ్ నారా దేవాన్ష్ పేరుతో అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అన్న ప్రసాదాలు భక్తులకు వడ్డించనున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.

Related Posts
హరీష్ రావు పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
jupalli

హరీష్ రావు పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై రాజకీయ వేడిని పెంచుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ Read more

Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం
Akbaruddin విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం అక్బరుద్దీన్ ఆగ్రహం

Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అమలైన "మన ఊరు - మన బడి" కార్యక్రమంపై Read more

Malaysia: మలేషియాలో గ్యాస్ అగ్నిప్రమాదం: వంద మందికి పైగా గాయాలు
మలేషియాలో గ్యాస్ అగ్నిప్రమాదం: వంద మందికి పైగా గాయాలు

మలేషియాలోని పుత్రా హైట్స్ నగరంలో, మంగళవారం ఘోరమైన గ్యాస్ పైపు పేలుడు జరిగింది. ఈ ప్రమాదం కారణంగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. మంటలు అనేక ఇళ్లకు Read more

మాజీ మంత్రి హరీశ్ రావుపై మరో కేసు
Another case against former minister Harish Rao

కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్‌ : తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×