AndhraPradesh: ఉగాది సందర్బంగా రూ.38 కోట్ల సహాయ నిధి ఫైలుపై సంతకం చేసిన సీఎం చంద్రబాబు.. ఈ మ్యాచ్‌లో గెలవడం రెండింటికీ ఎంతో కీలకం. సంజూ సాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరూ తమ గేమ్ ప్లాన్‌లను సిద్ధం చేసుకున్నారు. కీలక ఆటగాళ్ల ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉంది. AndhraPradesh: ఉగాది సందర్బంగా రూ.38 కోట్ల సహాయ నిధి ఫైలుపై సంతకం చేసిన సీఎం చంద్రబాబు..

AndhraPradesh: ఉగాది సందర్బంగా రూ.38 కోట్ల సహాయ నిధి ఫైలుపై సంతకం చేసిన సీఎం చంద్రబాబు..

ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన,అనంతరం పేదలకు శుభవార్త చెప్పారు. నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.ఉగాదిసందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని కీలక పేదలకు సాయం అందించేందుకునిర్ణయం తీసుకున్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేదలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

Advertisements

సహాయ నిధి

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేయడం గమనార్హంఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రూ.38 కోట్లు విడుదల చేయగా, 3,456 మంది పేదలకు ప్రయోజనం కలిగేలా ఈ నిధులను వినియోగించనున్నారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇది పెద్ద సహాయంగా మారనుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిద్దాం అన్నారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని చంద్రబాబు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ప్రత్యేక దృష్టి

కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల ఆరోగ్య భద్రతపై ప్రధానంగా దృష్టిపెట్టింది. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.పేదలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థికంగా కుంగిపోకుండా,ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేదలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

స్పందన

ఈ కార్యక్రమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, పేదల వైద్య ఖర్చులను భరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం పట్ల నిరుపేద కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఉగాది రోజున సీఎం చంద్రబాబు చేసిన ఈ మానవతా గుణం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

Related Posts
ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయం – షర్మిల
ys sharmila

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు పెట్టుబడి కూడా రాని ధరలకు Read more

నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌ !
Nagababu nomination as MLC candidate today!

అమరావతి: నేడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్‌ వేయనున్నారు. కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా Read more

ఢిల్లీ రాజకీయాల్లో ఎర్రన్న ముద్ర చెరగనిది- లోకేశ్
yerram naidu

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట స్థానం కలిగిన మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ప్రజలకు అత్యంత చేరువైన Read more

Rain : ఏపీలోని ఆ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు
Rain alert: మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భగ్గుమంటూ ఎండలు పొగలు వేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×