CM Chandrababu meets Union Minister Nirmala Sitharaman

కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు భేటీ

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తొ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై కేంద్ర ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేసే అవకాశముంది. అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు. శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాడ్ జోషిల అపాయింట్ మెంట్ కోరారు. అవి కూడా ఖరారు అయితే వారితో భేటీ అయి.. అనంతరం విజయవాడకు బయలుదేరి వస్తారు.

అలాగే శుక్రవారం మధ్యాహ్నం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కాగా, చంద్రబాబు, నిర్మలా సీతారామన్‌తో జరుగుతున్న భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి సంబంధించిన 4, 5 అంశాలు నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకురాబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రూ. 11,500 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహకరించడంపై ఆయన ధన్యవాదాలు తెలుపనున్నారు.

image

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో సవరించిన అంచనాలకు సంబంధించి ఇంకా కొంత పెండింగ్‌లో ఉన్నాయని, కొన్ని అంచనాలను అయితే కేంద్రం ఆమోదించిందని.. కేంద్ర జలశక్తి ఆమోదించిన తర్వాత కేంద్రం ఆమోదించాల్సి ఉంది. సుమారు రూ. 45 వేల కోట్ల వరకు సవరించిన అంచనాలను కేంద్రం అంగీకరించాల్సి ఉంది. అయితే విడతల వారీగా కొన్ని నిధులను కేంద్రం విడుదల చేసింది. డయాఫ్రంవాల్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి నిధులు విడుదల చేసింది. అయితే ఇప్పుడే పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడెక్కడ నిధులు పెంగింగ్‌లో ఉన్నది వాటికి సంబంధించిన అంశాలను చంద్రబాబు కేంద్రమంత్రితో ప్రస్తావించనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని నేరుగా గురువారం రాత్రి 12.30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు.

Related Posts
మరోసారి బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్: కేటీఆర్
మరోసారి బీజేపీని గెలిపిస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అంతేకాదు , కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. కంగ్రాట్స్‌.ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ Read more

మూడవ త్రైమాసికం (క్యు3)లో 23% వాటా తో భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సామ్‌సంగ్
Samsung continues to dominate Indias smartphone market with 23 share in Q3

గురుగ్రామ్ : కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా డాటా ప్రకారం, 2024లో వరుసగా మూడవ త్రైమాసికంలో భారతదేశంలో విలువ ప్రకారం సామ్‌సంగ్ నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ Read more

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్1

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పరీక్ష భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, Read more

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌..ఎందుకంటే..!
shamshabad airport red aler

జనవరి 26న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *