AP inter class

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సా.5 వరకు తరగతులు

రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియట్ కాలేజీలు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తున్నారు. ఈ టైమింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌వ‌రించింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు టైమింగ్స్‌ను పొడిగించారు. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

విద్యార్థులు సరిగా రాణించ‌క‌పోవ‌డంతోనే గంటసేపు టైమింగ్స్ పెంచామ‌ని.. ఆ గంట‌సేపు విద్యార్థులు కాలేజీల్లోనే చ‌దువుకుంటార‌ని తెలిపారు. ఇక నుంచి సాయంత్రం 4 గంట‌ల నుండి 5 గంట‌ల వ‌ర‌కు కాలేజీల్లో స్ట‌డీ అవ‌ర్స్ నిర్వ‌హించాల‌ని డైరెక్ట్ కృతిక శుక్లా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేర‌కు టైమ్ టేబుల్స్‌ను సిద్ధం చేయాల‌ని అన్ని ప్ర‌భుత్వ, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియట్ కాలేజీ ప్రిన్సిప‌ల్స్‌కు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ జూనియ‌ర్ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు ప్రైవేట్ స్కూళ్లలో ఇచ్చిన‌ట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాల‌ని కృతిక శుక్లా ఆదేశించారు. ఆ కార్డు న‌మూనాను కాలేజీలకు పంపించారు. వృత్తి విద్యా కోర్సుల విద్యార్థుల‌కు తెల్లరంగు, జ‌న‌ర‌ల్ విద్యార్థుల‌కు ఫస్టియర్‌ విద్యార్థులకు వారికి లేత ప‌సుపు రంగు, సెకండియర్‌ విద్యార్థులకు నీలం రంగు కార్డుల‌ను ముద్రించి ఇవ్వాల‌ని సూచించారు.

Related Posts
కిసాన్ దివాస్ 2024: రైతుల కృషిని స్మరించుకునే రోజు
kisan diwas

ప్రతి సంవత్సరం డిసెంబరు 23న భారతదేశంలో "కిసాన్ దివాస్" లేదా "కిసాన్ దినోత్సవం" జరుపుకుంటారు. ఈ రోజు వ్యవసాయ క్షేత్రంలో కార్మికులు మరియు రైతుల మహత్వాన్ని గుర్తించేందుకు, Read more

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భారతీయుల మృతి
Russia Ukraine war.. Indian

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న వీరిలో ఇంకా 16 మంది అదృశ్యంగా ఉన్నారని Read more

 శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
cr 20241012tn670a399a39849

శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న దారుణం అందరినీ తీవ్ర మానసిక కల్లోలం చెందేలా చేసింది. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లి సమీపంలో ఈ సంఘటన జరిగింది, అక్కడ అత్తాకోడళ్లపై Read more

త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు: సీఎం రేవంత్ రెడ్డి
Police are a symbol of sacrifice and service. CM Revanth Reddy

హైదరాబాద్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గోషామహల్ పోలీస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *