ఆంజనేయ స్వామి దయతో క్షేమంగా ఇంటికి వచ్చిన మార్క్:చిరంజీవి

Chiranjeevi: ఆంజనేయ స్వామి దయతో క్షేమంగా ఇంటికి వచ్చిన మార్క్:చిరంజీవి

 సింగపూర్ స్కూల్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు మార్క్ శంక‌ర్ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ప్రమాదం జరిగిన రోజున చేతుల‌కి, కాళ్ల‌కి గాయాలు కావ‌డంతో పాటు పొగ ఊపిరి తిత్తుల్లోకి చేరడంతో శ్వాస పీల్చుకోవడానికి మార్క్ శంక‌ర్ కాస్త ఇబ్బంది ప‌డ్డాడు.

Advertisements

ఈ ఘటనలో చేతులు, కాళ్ళు గాయపడటమే కాకుండా, ప్రమాద సమయంలో ఏర్పడిన పొగ ఊపిరితిత్తుల్లోకి చేరడంతో, మార్క్ శంకర్ తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. బ్రాంకోస్కోప్‌ అనే పద్ధతిలో తిత్తుల్లో చేరిన పొగను శుభ్రం చేయడమే కాకుండా, శ్వాసను సహజస్థితికి తీసుకొచ్చే దిశగా చికిత్స కొనసాగింది. ఈ విష‌యం తెలియగానే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులందరు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ గారితో కలిసి హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. అక్కడ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పందన

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, త్వరలోనే మామూలుగా ఎప్పటిలానే ఉండే పరిస్థితిలోకి వస్తాడు.” అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం ద్వారా అభిమానులకు ఓ భరోసా ఇచ్చారు. ఈ విష‌యం తెలిసాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఆ దేవుడి ద‌య వ‌ల‌న మార్క్ శంక‌ర్ త్వ‌ర‌గానే కోలుకున్నాడ‌ని ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. “నా కుమారుడిపై మీరు చూపిన ప్రేమ, ప్రార్థనలు నాకు ఎనలేని బలం ఇచ్చాయి. మీ అందరికీ నా పేరు పేరునా కృతజ్ఞతలు.” అని ఆయన పేర్కొన్నారు. ఇక పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత దాదాపుగా అందరూ స్పందించారు. మార్క్ శంకర్ కోలుకోవాలని సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ప్రార్థించారు. వైసీపీ అధినేత జగన్, రోజా కూడా.. పవన్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జనసేన పార్టీ వ్యతిరేకులు కూడా మంచి మనసుతో స్పందించ‌డం చూశాక రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకుండా.. ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉంటే ఎంత బాగుంటుందో క‌దా అనే అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Read also: Vaishnavi Chaitanya : వైష్ణవీ కి స్క్రిప్ట్ పరీక్ష మొదలైంది!

Related Posts
ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకే అసెంబ్లీకి జగన్ – నిమ్మల విమర్శలు
ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకే అసెంబ్లీకి జగన్ - నిమ్మల విమర్శలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (ఫిబ్రవరి 24) ప్రారంభం కానున్నాయి. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి Read more

Jagan: మీ బెంగళూరులో ఏమో కానీ… ఇక్కడ మాత్రం..!: జగన్ కు టీడీపీ కౌంటర్
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

తాజాగా, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు, "ఏపీలో ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతోంది?" అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై Read more

15 ఏళ్లకే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్.. 1300 కోట్ల ఆస్తులు.. ఈ బ్యూటీ ఎవరంటే..
Asin

చిన్న వయసులోనే నటనపై ఆకర్షణతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ చిన్నారి, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన ముద్దు ముద్దు ముఖంతో, అభినయంతో అతి తక్కువ Read more

ప్రశాంత్ నీల్‌ సినిమాల పైనే ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు
ప్రశాంత్ నీల్‌ సినిమాల పైనే ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా టాలీవుడ్ స్టార్ జూ. ఎన్టీఆర్ ఈ మధ్యే ‘దేవర’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×