చిరంజీవి ఇటీవల విజయవాడలో జరిగిన ‘మైండ్సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆత్మీయతతో పాటు వ్యూహాత్మకతను కూడా సూచిస్తున్నాయి. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, సాధారణంగా సామాజిక, ప్రేరణాత్మక విషయాలపై మాట్లాడుతూనే చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా అలిపిరి దాడిని గుర్తు చేస్తూ, అందులో పడిపోయినా లేచి నిలబడిన ధైర్యవంతుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించడంలో ఆయన ప్రశంసలతో పాటు ఒక రాజకీయ పరోక్ష సందేశం కూడా ఉన్నదని పర్యవేక్షకులు భావిస్తున్నారు.

ధీరోదాత్తుడు అనే పదం ప్రాధాన్యం
చిరంజీవి చంద్రబాబుని ధీరోదాత్తుడుగా పేర్కొనడం వంటివి సాధారణ వ్యాఖ్యలు కావు. తెలుగు సాహిత్యంలో ధీరోదాత్తుడు అనే పదం నాయకత్వం, మానవీయత, సహనశీలత కలిగిన నాయకుడిని సూచిస్తుంది. ఈ పదం వాడడం ద్వారా చిరంజీవి చంద్రబాబులో ఉన్న నైతిక ధైర్యాన్ని, రాజకీయ మానవతను గుర్తించడమే కాకుండా, ఇతర నాయకులతో ఆయనను భిన్నంగా చూపించాలనే ప్రయత్నంగా ఇది అభిప్రాయించవచ్చు. ఊహించని పరిస్థితులు చంద్రబాబు మానసిక స్థైర్యంతో ఉన్నారని అంతటి ధీరోదాత్తత ఆయనలో తాను చూశానని వివరించారు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్లాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు అని చిరంజీవి పేర్కొన్నారు. చంద్రబాబు తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలనే తపించారని ప్రశంసించా రని విశ్లేషించారు. కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారన్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచిన చంద్రబాబు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిం దన్నారు. జీవితం పూలపాన్పు కాదని ప్రతిచోటా ఆటంకాలు వస్తుంటాయని వివరించారు. అయినా ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయన్నారు.
ఎన్నో అవరోధాలు ఎన్ని అవరోధాలు వచ్చినా చిత్తశుద్ది ముఖ్యమని చిరంజీవి వివరించారు. డిస్ట్రక్షన్ (విధ్వంసా లు), డిజప్పాయింట్మెంట్ (నిరుత్సాహం) వస్తుంటాయని డీ మోటివేట్ (నిరుత్సాహ పరచ డం) చేసే వాళ్లుంటారని చెప్పారు. ఎక్కడా బెదరకూడదని చిరంజీవి పేర్కొన్నారు. చాలామందికి మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. చిరంజీవి స్వయంగా తన సినిమా దశ నుండి రాజకీయ దశలోకి వెళ్లినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. కొంతమంది నిర్మాతలు తక్కువ స్థాయి పాత్రలు చేయమని సూచించగా, తాను ఎప్పటికీ విలువను కోల్పోని పాత్రలను మాత్రమే చేశానని చెప్పారు. ఇదే మైండ్ సెట్ రాజకీయాల్లోనూ అవసరం అని చిరంజీవి వివరించారు.
Read also: AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛన్లు… ఈరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ