India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న వేళ,ఇరుదేశాల మ‌ధ్య రోజురోజుకూ ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ కంట్రీ చైనా స్పందించింది.భార‌త్‌, పాకిస్థాన్ సంయ‌మ‌నం పాటించాలని శ‌నివారం చైనా విదేశాంగ శాఖ(Department of Foreign Affairs) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.భార‌త్‌-పాక్ మ‌ధ్య నెలకొన్న ఉద్రిక్త‌త పరిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నాం. స్థిర‌త్వం, శాంతి కోసం ఇరుదేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరుతున్నాం. ఉద్రిక్త‌త‌ల‌ను తీవ్ర‌త‌రం చేసే చ‌ర్య‌ల‌ను రెండు దేశాలు త‌గ్గించుకోవాలి. శాంతియుతంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలి. ఇరుదేశాల మ‌ధ్య స‌మ‌స్య‌ ముగింపున‌కు అవ‌స‌ర‌మైతే నిర్మాణాత్మ‌క పాత్ర పోషించ‌డానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని చైనా విదేశాంగ శాఖ త‌న‌ ప్ర‌క‌ట‌నలో పేర్కొంది.భార‌త్ ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్‌, పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీఓకే)ల‌లోని ఉగ్ర‌స్థావరాలే ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) చేప‌ట్టింది. తొమ్మిది ప్రాంతాల్లో క్షిప‌ణి దాడులు నిర్వ‌హించి సుమారు 100 మంది ముష్క‌రుల‌ను మట్టుబెట్టింది. కానీ, దాయాది పాకిస్థాన్ మాత్రం నీచ బుద్ధితో భార‌త్‌లోని పౌరులే ల‌క్ష్యంగా స‌రిహ‌ద్దు వెంబ‌డి డ్రోన్‌, మిస్సైల్ దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త తీవ్ర‌త‌ర‌మైంది.

Advertisements

అమెరికా ఏమందంటే

భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(S. Jaishankar) తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడారు. పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే చర్చలు జరపాలని కోరారు. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ప్రకటన విడుదల చేశారు.

 India-Pakistan: రెండు దేశాలు  సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన
India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

జీ7 దేశాలు 

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. ఇరుదేశాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా సైనిక సంఘర్షణను వెంటనే తగ్గించుకోవాలని కోరాయి. ఇరుదేశాల మధ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపాయి.అలాగే పహల్గాం ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నాయి. సైనిక ఘర్షణల(Military Conflict) వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు ఉంటుందని స్పష్టం చేశాయి. భారత్‌- పాక్‌ లోని పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని వెల్లడించాయి. శాంతిస్థాపన కోసం ఇరుదేశాలు చర్చల్లో పాల్గొనాలని కోరాయి.

Read Also: Srinagar Explosions: శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు..నిర్ధారించిన అధికారులు

Related Posts
Petrol, Diesel: తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
పాక్ లో పెట్రోల్ బంక్ లు మూత.. ఇంధన కొరతతో ఇబ్బందులు

రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుతాయా..? ప్రస్తుతం ఇంధన ధరల భారాన్ని మోస్తున్న ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్న తలెత్తుతుంది. గల్ఫ్ Read more

India-Pakistan: దేశానికి మ‌ద్ద‌తుగా మేమున్నాం: అంబానీ, అదానీ
India-Pakistan: దేశానికి మ‌ద్ద‌తుగా మేమున్నాం: అంబానీ, అదానీ

యుద్ధ వాతావరణంలో దేశానికి అండగా కార్పొరేట్ దిగ్గజాలు: అంబానీ, అదానీ ధీమా భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ, దేశ సార్వభౌమత్వం, భద్రత Read more

India – Pakistan War : దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్
pak indwar

ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి మితిమీరుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో పాక్ సైన్యం ఘాటైన దాడులకు దిగింది. డ్రోన్ల ద్వారా బాంబు దాడులు, కాల్పులతో జమ్మూ కశ్మీర్ ప్రాంతం Read more

ప్రయాణికులకు శుభవార్త.. డబ్బులు చెల్లించకుండా రైలు టిక్కెట్
indian railways

దేశంలో భారతీయ రైల్వే సంస్థ కోట్ల మంది ప్రయాణికులను రోజూ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. దశాబ్ధాలుగా తక్కువ ఖర్చులో దూర ప్రయాణాలు చేసేందుకు ఈ ప్రభుత్వ సంస్థ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×