నైజీరియాలో కూలిన స్కూలు భవనం..22 మంది విద్యార్థులు మృతి

నైజీరియాలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం తో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

భవనం కూలిపోయిన క్రమంలో 154 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిలో 132 మంది రక్షించబడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. పాఠశాల భవనం కూలిపోవడంతో అప్రమత్తమైన పలువురు పిల్లలు విద్యార్థులు సెయింట్స్ అకాడమీ కళాశాలకు చేరుకున్నారు. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 15 ఏళ్ల లోపు ఉంటుందని అధికారులు అన్నారు. ప్రమాదం తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న 100 మందికి పైగా ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు.