'Chhaava' special screening in Parliament!

Chhaava: పార్లమెంట్​లో ‘ఛావా’ స్పెషల్ స్క్రీనింగ్ !

Chhaava: బాలీవుడ్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఛావా’ ను ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించబోతున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీల కోసం పార్లమెంట్‌లోనే ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. మార్చి 27న పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఛావా సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. చిత్ర దర్శకుడితో పాటు తారాగణం కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisements
పార్లమెంట్​లో  ఛావా స్పెషల్ స్క్రీనింగ్

కేవ‌లం హిందీలోనే రూ.750 కోట్లు

బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్ నటించిన చిత్రమే ‘ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా.. దినేష్ విజన్ నిర్మించారు. ర‌ష్మిక మంద‌న్నా, అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూప‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా.. కేవ‌లం హిందీలోనే రూ.750 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

గతంలోనే ఛావా సక్సెస్‌పై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

రీసెంట్‌గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేయ‌గా.. భారీ వ‌సుళ్ల‌ను సాధించింది. ఛావా సక్సెస్‌పై గతంలోనే ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరై ఆయన.. ప్రస్తుతం దేశంలో ఛావా హవా కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఛావా చిత్రానికి స్ఫూర్తినిచ్చిన నవల(ఛావా) రచయిత శివాజీ సావంత్‌కు ఈ ఘనతంతా దక్కుతుందని అభినందించారు.

Related Posts
ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై పిడి యాక్ట్ : మంత్రి కొల్లు రవీంద్ర
kollu

మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక విధానంలో జరుగుతున్న మార్పులు, గత ప్రభుత్వ కాలంలో జరిగిన తప్పిదాలు, మరియు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించి వివరణ ఇచ్చారు. గత Read more

తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
State Labor Minister Vasams

తిరుపతి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ని అకస్మాతుగా శుక్రవారం తనిఖీ చేసారు. అదేవిధంగా హాస్పటల్ లో Read more

Sunita Williams : సురక్షితంగా భూమికి చేరిన సునీతా విలియమ్స్
Sunita Williams safely return to Earth

Sunita Williams : సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, Read more

యాదవ కార్పొరేషన్ చైర్మన్ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu attend

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి లోక్ సభ స్థానం టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×