Changes in CM Chandrababu security.

సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు..!

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో భారీ మార్పులు చేశారు. ఇటీవల కాలంలో చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ మార్పులు చేర్పులు చేశారు. మావోయిస్టులను సైతం ఎదుర్కొనే విధంగా సీఎం సెక్యూరిటీ వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీం ను చేర్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న NSG, SSG స్థానిక సాయుధ బలగాలకు అదనంగా మరో ఆరుగురు కమాండలతో ఈ కౌంటర్ యాక్షన్ టీం సీఎం చంద్రబాబుకు భద్రత ఇవ్వనున్నది.

image
image

ఈ కౌంటర్ యాక్షన్ టీంకు ఎస్పీజీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. అయితే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు పై జరిగిన దాడుల నేపథ్యంలో y+ కేటగిరి సెక్యూరిటీ కాస్త 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా కౌంటర్ యాక్సిడెంట్ కూడా సీఎం భద్రత వలయంలోకి రానుంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు భద్రత ఇకపై కట్టుదిక్కంగా మారింది.

కాగా, దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్‌ దాడి చేసిన తర్వాత ఆయనకు ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమాండోలు వచ్చారు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు చంద్రబాబుకు భద్రతా వలయం కూడా ఎప్పుడూ కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు పలు మార్లు దాడులు జరిగిన సమయంలో కూడా ఎన్ఎస్‌జీ కమాండోల సంఖ్యను పెంచారు. ముందు ఆరుగురు కమాండోలు ఉండగా.. చంద్రబాబు బయటకు వెళ్లే సమయంలో ఆ సంఖ్యను 12కు చేశారు. వీరు నిత్యం కంటికిరెప్పలా చంద్రబాబును కాపాడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు నక్సల్స్‌ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీంను రంగంలోకి దింపారు.

Related Posts
వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు
tirumala VIp Tickets

తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల విక్రయం వివాదం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌పై కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన సాయికుమార్ Read more

విద్యా పరమైన ఆవిష్కరణలకు కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్
KLH Global Business School at the forefront of educational innovation

ఢిల్లీ: కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఇటీవల, 2024 డిసెంబర్ 2వ తేదీ నుండి 14వ తేదీ వరకు రెండు వారాల పాటు నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ Read more

పరిశ్రమలో మొదటి సహ-సృష్టించిన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన నథింగ్
Nothing launched the industrys first co created smartphone

ఆరు నెలలు, నలుగురు విజేతలు మరియు ఒక విలక్షణమైన ఉత్పత్తి- నథింగ్ తమ సరికొత్త స్మార్ట్ ఫోన్ : ఫోన్ (2ఎ) ప్లస్ యొక్క కొత్త ఎడిషన్ Read more

ఎండాకాలం మొదలైందోచ్
summer

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి, ఎండలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ప్రజలు వేడికి తట్టుకోలేకపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఎండాకాలం ప్రభావం ముందుగానే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *