నేడు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన

సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి చంద్రబాబు బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వాటిపై అధికారులతో చర్చలు జరపడం..గడిచిన ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చులు , దోపిడీ గురించి అరా తీయడం..మరోపక్క రాష్ట్రంలో నెలకొన్న సమస్యల ఫై దృష్టి సారిస్తూ ఇలా బిజీ బిజీ గా ఉన్నారు. ఇదే క్రమంలో ఈరోజు మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు.

ఉదయం 10 గంటలకు వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోగాపురం ఎయిర్పోర్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. వైజాగ్లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు.