ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పార్టీఅతన ముగిసింది. ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లిన ఆయన రెండు రోజులపాటు ఢిల్లీ లో బిజీ బిజీ గా గడిపారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీ అభివృద్ధి విషయంపై పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు, మెరుగైన రహదారుల నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు., అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు మోదీ (PM Modi) తో చర్చలు జరిపిన చంద్రబాబు.. ఏపీకి రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈరోజు ఢిల్లీ నుండి ఏపీకి రానున్నారు.