10 రోజుల తర్వాత ఇంటికెళ్లిన చంద్రబాబు

సీఎం చంద్రబాబు 10 రోజుల తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఈ నెల 2 నుంచి సీఎం కలెక్టరేట్లోనే బస్సులో బస చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. వినాయక చవితి, పెళ్లి రోజును కూడా ఆయన అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం వరద సహాయక చర్యలు ముగియడంతో సీఎం ఇంటికి వెళ్లారు.

పది రోజుల క్రితం విజయవాడ లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి బుడమేరు కు గండ్లు పడడం తో నగరంలోని పలు కాలనీ లు నీట మునిగాయి. దాదాపు మూడు రోజులు ఆ కాలనీ లన్ని నీటిలోనే ఉన్నాయి. దీంతో గత పది రోజులుగా ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునే పనిలో ఉంది. సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ప్రజలకు సాయం చేసారు. నిన్నటి తో అంత సెట్ అవ్వడం తో చంద్రబాబు పది రోజుల తర్వాత ఇంటికి వెళ్లారు.