అమిత్ షా, నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ.. వివరాలు

ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మల, సీఆర్ పాటిల్ CM చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి రుణ పరిమితి పెంచడంతో పాటు రాజధానికి ఇప్పిస్తామన్న పదిహేను వేల కోట్ల నిధుల గురించి.. ఇతర గ్రాంట్ల గురించి చర్చించారు.

కాగా, ప్రధానితో భేటీ అనంత‌రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై ఆమెతో చర్చించారు. సత్వరమే నిధుల విడుదల జరిగేలా చూడాలని కోరారు. నిర్మలాతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు… అక్కడే ఉన్న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు.