వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu : వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu : వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నేడు సచివాలయంలో వేసవి ప్రణాళికపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా ముందుగా అన్ని జిల్లాల్లో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు నీటి సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేలా అధికారులు పర్యవేక్షణను కొనసాగించాలని సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు, బస్ స్టాండ్లు, కూలీల పని ప్రదేశాలు, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

Advertisements
వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu Naidu వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించాలన్నారు. 2014-19 నాటికి మాదిరిగా, ఈసారి కూడా ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్యతో పాటు పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంటుందని గుర్తించిన సీఎం, ఈ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పశువులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎండలకు గురికాకుండా పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని సీఎం సూచించారు.

తాగునీరు అందుబాటులో ఉండేలా పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే అడవుల్లో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ముందుగా చర్యలు తీసుకోవాలని, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణను కఠినతరం చేయాలని స్పష్టం చేశారు.మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. గ్రామాల్లో నీటి లభ్యత పెంచేందుకు నరేగా ద్వారా ఫాం పాండ్స్ నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టాలని సూచించారు.

వేసవిలో ఉపాధి హామీ కూలీలకు అదనపు పనిదినాలు మంజూరు చేయడంతో పాటు, పనిదినాల్లో నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు.ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు ఉపాధి హామీ కూలీల పనులు పూర్తిచేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. అలాగే, వారికి అవసరమైన నీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మున్సిపల్ కార్మికులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పని చేయకుండా చూడాలని సీఎం సూచించారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితులకు తగినంత సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే దోమల నివారణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

Related Posts
Appsc: ఏపీపీఎస్సీ లెక్చరర్‌ పోస్టులకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల..ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే?
Appsc: ఏపీపీఎస్సీ లెక్చరర్‌ పోస్టులకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల..ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) ఇటీవల పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, టీటీడీ డిగ్రీ, ఓరియంటల్, జూనియర్ కాలేజీల్లో Read more

సంక్రాంతికి మరో 4 స్పెషల్ రైళ్లు
4 more special trains for Sankranti

సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీని తగ్గించడంలో భాగంగా మరో నాలుగు Read more

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌
Minister Payyavula Keshav presented the budget in the Legislative Assembly

అమరావతి: ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ 2024-25ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ కాపీస్‌లోని పద్దులను చదివి వినిపిస్తున్నారు. అంతకుముందు ఆయన Read more

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం..ఎక్కడివో తెలుసా..?
Rs.20 lakhs is available in

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం కావడం అందర్నీ షాక్ కు గురిచేసింది. కాకపోతే ఇదంతా కూడా దొంగసొమ్ము అని తేలింది. ఒడిశాకు చెందిన ఓ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×