Chandrababu Naidu ప్రతి నెల 3వ శనివారం ఏపీలో స్వచ్ఛ ఆంధ్ర

Chandrababu Naidu : ప్రతి నెల 3వ శనివారం ఏపీలో స్వచ్ఛ ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల మూడవ శనివారాన్ని ఈ కార్యక్రమానికి కేటాయిస్తున్నారు. ప్రతి సారి ఒక కొత్త థీమ్‌తో ప్రజలలో అవగాహన పెంచే విధంగా దీనిని కొనసాగిస్తున్నారు.తాజాగా ఏప్రిల్ నెల ‘స్వచ్ఛ ఆంధ్ర’ థీమ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈసారి ఎంపికైన అంశం “ఇ-వేస్ట్ సేకరణ, రీసైక్లింగ్” పై ఆధారపడి ఉంది.“స్వర్ణాంధ్ర – 2047” లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా మేము ప్రతి నెలా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి కార్యక్రమం ప్రేరణాత్మకంగా ఉండేందుకు ప్రత్యేకమైన థీమ్‌ను తీసుకుంటున్నామని తెలిపారు.ఈ నెల థీమ్‌గా ఈ-వేస్ట్ ఎంచుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం “చెత్త నుంచి సంపద సృష్టించడం” అని ఆయన వివరించారు. సర్క్యులర్ ఎకానమీ సాధించాలంటే ఈ-వేస్ట్ సేకరణ, సరైన రీసైక్లింగ్ చాలా అవసరమన్నారు.

Advertisements
Chandrababu Naidu ప్రతి నెల 3వ శనివారం ఏపీలో స్వచ్ఛ ఆంధ్ర
Chandrababu Naidu ప్రతి నెల 3వ శనివారం ఏపీలో స్వచ్ఛ ఆంధ్ర

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలందరికీ ఓ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి అధికారులు, కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యార్థులు, యువతతో పాటు ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఇ-వేస్ట్ కలెక్షన్ డ్రైవ్‌ సక్సెస్ అవ్వాలంటే ప్రతి పట్టణం, గ్రామంలో ఇ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి నిర్వహణ బాధ్యతను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (SHG) సభ్యులకు ఇవ్వాలని చెప్పారు. గ్రామీణ మహిళల సమూహాలను చేర్చి వారినే కేంద్రాల నిర్వహణలో భాగస్వాములుగా తీసుకోవాలని సూచించారు.ఈ-వేస్ట్ కేంద్రాల్లో “రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్” అనే నినాదం ప్రతీ పౌరుని ప్రేరేపించేలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, మరోవైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్పత్తుల వ్యర్థాల నిర్వహణకు సమర్థమైన పరిష్కారాన్ని అందించవచ్చు.చివరగా చంద్రబాబు మాట్లాడుతూ – “స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కేవలం ఒక రోజు కార్యాచరణ కాదు, ఇది ఒక ఆలోచన, జీవనశైలి. ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ హృదయపూర్వకంగా స్వీకరించి, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములవ్వాలి” అని ఆకాంక్షించారు.

Read Alaso : KA Paul: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

Related Posts
రేపటి నుండి సమగ్ర కుటుంబ సర్వే..10 ప్రధాన అంశాలు
Comprehensive family survey from tomorrow.10 main points

హైదరాబాద్‌: రేపటి నుండి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ Read more

Kishan Reddy : బీజేపీకి సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి
Kishan Reddy బీజేపీకి సర్టిఫికెట్ అవసరం లేదు కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీపై ఎలా వ్యవహరించాలో బీజేపీకి కేటీఆర్ సూచించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగంగా స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల Read more

నేడు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు..!
CM Chandrababu visit to Annamayya district today

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాకు రానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ Read more

Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్ర దాడి.. ఎట్టకేలకు స్పందించిన పాక్‌ ప్రధాని
Pahalgam terror attack.. Pakistan Prime Minister finally responds

Pahalgam Terror Attack : పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ఎట్టకేలకు పహల్గాం ఉగ్ర దాడి పై స్పందించారు. పహల్గాం దాడి పై తటస్థ దర్యాప్తునకు తాము Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×