Chandrababu Naidu ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

Chandrababu Naidu : ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకున్నారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు, సామాన్యులు వరకు జన్మదినం సందర్భంగా ప్రేమను తెలియజేశారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భావోద్వేగంగా స్పందించారు. మీ అందరి ప్రేమ, ఆప్యాయత నన్ను హృదయంగతంగా తాకింది, అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.తన 75 ఏళ్ల జీవితం, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజలు నిలిచిన బలంగా నిలిచారని గుర్తు చేశారు. “నాలాగే సేవ చేసే అవకాశం మళ్లీ ఇవ్వడం గొప్ప గౌరవం,” అన్నారు.ముఖ్యమంత్రిగా నాలుగోసారి అవకాశం ఇవ్వడం అపూర్వం అన్నారు.తెలుగు ప్రజల అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు.మీ కలల కోసం నిరంతరం కష్టపడతాను,” అని హామీ ఇచ్చారు. 2047 నాటికి తెలుగు జాతిని శక్తివంతంగా తీర్చిదిద్దతానని చెప్పారు.‘స్వర్ణాంధ్ర 2047’ దిశగా కృషి చేస్తానని అన్నారు.“సమాజంలో అసమానతలు తొలగించాలి.

Advertisements
Chandrababu Naidu ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
Chandrababu Naidu ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

పేదరికం పోవాలి,” అన్నారు ఈ లక్ష్యంతో ‘పీ4’ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ప్రతి పేద కుటుంబాన్ని స్వర్ణ కుటుంబంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని వివరించారు.మూడుదశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ మార్పు తెచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు ‘పీ4’ ద్వారా మరింత సమగ్ర అభివృద్ధి సాధిస్తామన్నారు.ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు విజయాలు సాధిస్తున్నారని అన్నారు. అధిక తలసరి ఆదాయంతో ముందంజలో ఉన్నామన్నారు. “మనకు అసాధ్యమేమీ లేదు. కలిసికట్టుగా పనిచేస్తే తిరుగులేని విజయాలు సాధిస్తాం,” అన్నారు.2047 నాటికి తెలుగు జాతిని శక్తిమంతంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయం అని తెలిపారు. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించేందుకు పాలన సాగిస్తానన్నారు.తెలుగు ప్రజలలో ఆత్మగౌరవం సహజం అని చెప్పారు. “వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అందరం కలిసి పనిచేయాలి,” అని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజున కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also : Fire : తిరుమల ఘాట్ రోడ్డులో అగ్నికి ఆహుతైన కారు

Related Posts
Accident : వినుకొండ లో ఘోర రోడ్డు ప్రమాదం
vinukonda accident

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)జరిగింది. బొలెరో ట్రాలీ వాహనం మరియు కొబ్బరికాయల లారీ ఒకదానికొకటి Read more

JD Vance : కాసేపట్లే మోదీతో భేటీ కానున్న వాన్స్
JD Vance కాసేపట్లే మోదీతో భేటీ కానున్న వాన్స్

ఇండియా పర్యటనలో భాగంగా, అమెరికా ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి మన దేశంలో అడుగుపెట్టారు. ఆయన భార్య ఉష తెలుగు అమ్మాయే కావడంతో, ఈ పర్యటన Read more

అమరావతి ఇన్వెస్టర్లలో భయం పట్టుకుంది – పొంగులేటి
ponguleti runamafi

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనమవుతుందని, అమరావతికి పెట్టుబడులు వెళ్తాయని జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇటీవల కురిసిన భారీ Read more

Bharat : సరిహద్దుల్లో భారత్ యుద్ధ విన్యాసాలు ప్రారంభం
India Pakistan War: మోర్టార్ షెల్స్‌తో సాధారణ పౌరులపై పాక్ దుశ్చర్యలు మోర్టార్ షెల్స్‌తో

Bharat : సరిహద్దుల్లో నేడు యుద్ధ విన్యాసాలు: భారత్ సైనిక సన్నద్ధత ఉద్ధృతం కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడికి భారత ప్రభుత్వం కఠినంగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×